Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానంతో భార్యను ఇనుపరాడ్డుతో కొట్టి చంపేసిన భర్త..

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (11:04 IST)
అనుమానం పెనుభూతమైంది. ఫలితంగా ఓ కసాయి భర్త తన భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ శివారులోని పీకే రామయ్యకాలనీలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన లావుడియా రాములు అనే వ్యక్తి రమాదేవి(32) అనే వివాహితను కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే, రమాదేవికి అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్టు రాములు అనుమానిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. తాజాగా పీకల వరకు మద్యం సేవించి వచ్చిన రాములు... భార్యతో గొడవపడ్డాడు. వారిమధ్య ఘర్షణ పెద్దది కావడంతో ఇంట్లోని ఇనుప రాడ్‌తో రమాదేవి తలపై బాదడంతో తీవ్ర గాయమై సృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు గోదావరిఖనిలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించగా కరీంనగర్‌కు తరలించే క్రమంలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments