Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (09:41 IST)
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. దీంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 
 
వేసవి మొదలు కాకముందే.. ప్రతి రోజు 40 నుంచి 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో జనాలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే.. జంకుతున్నారు. కాగా బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
 
అత్యధికంగా నల్గొండ జిల్లాలో 42.4 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు అయింది. కాగా వచ్చే మూడు రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్‌ చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments