తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (09:41 IST)
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. దీంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 
 
వేసవి మొదలు కాకముందే.. ప్రతి రోజు 40 నుంచి 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో జనాలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే.. జంకుతున్నారు. కాగా బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
 
అత్యధికంగా నల్గొండ జిల్లాలో 42.4 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు అయింది. కాగా వచ్చే మూడు రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్‌ చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments