Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. కరోనా భయంతో దగ్గరకురాని ప్రజలు

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (11:34 IST)
కరోనా వైరస్ ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురిచేసింది. ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయినప్పటికీ.. ఆ శవం దగ్గరకు వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. ఇందుకు నిదర్శనమే కరీంనగర్ జిల్లా రైతు బజార్‌లో సంభవించిన ఓ ఘటన. ఈ మార్కెట్‌లో ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. కానీ, అతని వద్దకు వచ్చేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయలేకపోయారు. అతను కరోనా వైరస్ కారణంగానే చనిపోయారనే భయంతో ఒక్కరు కూడా సమీపానికి రాలేదు. ఈ దయనీయ పరిస్థితి కరీంనగర్‌లో చోటుచేసుకుంది. 
 
నిజానికి కరీంనగర్ జిల్లాకు వచ్చిన ఇండోనేషియా వాసులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తమకు సోకుతుందేమోనని భయపడుతున్నారు. ఆ జిల్లాలోని కాశ్మీర్‌గడ్డ రైతు బజార్‌కు బుధవారం కూరగాయల కోసం ఓ వ్యక్తి వచ్చి, వాటిని కొంటోన్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే మృతి చెందాడు. 
 
అయితే, ఆ మృతదేహం వద్దకు రావడానికి కూడా స్థానికులు భయపడ్డారు.. దూరంగానే ఉండిపోయారు. చివరకు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని సమాచారం చేరవేశారు. ఆ తర్వాత 104కు సమాచారం అందించి ఆ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments