Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. కరోనా భయంతో దగ్గరకురాని ప్రజలు

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (11:34 IST)
కరోనా వైరస్ ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురిచేసింది. ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయినప్పటికీ.. ఆ శవం దగ్గరకు వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. ఇందుకు నిదర్శనమే కరీంనగర్ జిల్లా రైతు బజార్‌లో సంభవించిన ఓ ఘటన. ఈ మార్కెట్‌లో ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. కానీ, అతని వద్దకు వచ్చేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయలేకపోయారు. అతను కరోనా వైరస్ కారణంగానే చనిపోయారనే భయంతో ఒక్కరు కూడా సమీపానికి రాలేదు. ఈ దయనీయ పరిస్థితి కరీంనగర్‌లో చోటుచేసుకుంది. 
 
నిజానికి కరీంనగర్ జిల్లాకు వచ్చిన ఇండోనేషియా వాసులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తమకు సోకుతుందేమోనని భయపడుతున్నారు. ఆ జిల్లాలోని కాశ్మీర్‌గడ్డ రైతు బజార్‌కు బుధవారం కూరగాయల కోసం ఓ వ్యక్తి వచ్చి, వాటిని కొంటోన్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే మృతి చెందాడు. 
 
అయితే, ఆ మృతదేహం వద్దకు రావడానికి కూడా స్థానికులు భయపడ్డారు.. దూరంగానే ఉండిపోయారు. చివరకు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని సమాచారం చేరవేశారు. ఆ తర్వాత 104కు సమాచారం అందించి ఆ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments