Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. కరోనా భయంతో దగ్గరకురాని ప్రజలు

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (11:34 IST)
కరోనా వైరస్ ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురిచేసింది. ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయినప్పటికీ.. ఆ శవం దగ్గరకు వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. ఇందుకు నిదర్శనమే కరీంనగర్ జిల్లా రైతు బజార్‌లో సంభవించిన ఓ ఘటన. ఈ మార్కెట్‌లో ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. కానీ, అతని వద్దకు వచ్చేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయలేకపోయారు. అతను కరోనా వైరస్ కారణంగానే చనిపోయారనే భయంతో ఒక్కరు కూడా సమీపానికి రాలేదు. ఈ దయనీయ పరిస్థితి కరీంనగర్‌లో చోటుచేసుకుంది. 
 
నిజానికి కరీంనగర్ జిల్లాకు వచ్చిన ఇండోనేషియా వాసులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తమకు సోకుతుందేమోనని భయపడుతున్నారు. ఆ జిల్లాలోని కాశ్మీర్‌గడ్డ రైతు బజార్‌కు బుధవారం కూరగాయల కోసం ఓ వ్యక్తి వచ్చి, వాటిని కొంటోన్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే మృతి చెందాడు. 
 
అయితే, ఆ మృతదేహం వద్దకు రావడానికి కూడా స్థానికులు భయపడ్డారు.. దూరంగానే ఉండిపోయారు. చివరకు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని సమాచారం చేరవేశారు. ఆ తర్వాత 104కు సమాచారం అందించి ఆ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments