Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కేసీఆర్ కుట్ర : టీకాంగ్రెస్

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (16:15 IST)
ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. రైతుల ముసుగులో భారాస నేతలు ఈ గొడవలకు ప్రయత్నం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. 
 
ఈ మేరకు గురువారం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్టు చేసింది. ప్రభుత్వ అధికారులు, కలెక్టరుపై దాడిని భారాస స్ పార్టీ సమర్థిస్తోందని ఈ ట్వీట్‌లో విమర్శించింది. రైతులు, మహిళలు, నిరుద్యోగులంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు ముసుగువేసి దాడులకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించింది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారని మండిపడింది.
 
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై ఇటీవల లగచర్ల గ్రామంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి బీఆర్ఎస్ నాయకుల పనేనని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఈ దాడి వెనుక మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందంటూ పట్నం నరేందర్ రెడ్డి బయటపెట్టారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments