Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసులో తెరాస మంత్రులు ఉన్నారా? అయితే వదిలిపెట్టొద్దు : కేసీఆర్

హైదరాబాద్ వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో పలువురు తెరాస మంత్రులు, నేతలతో పాటు వారి కుమారులకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు.

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (15:28 IST)
హైదరాబాద్ వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో పలువురు తెరాస మంత్రులు, నేతలతో పాటు వారి కుమారులకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. 'డ్రగ్స్' కేసు వ్యవహారంలో టీఆర్ఎస్ నాయకులైనా, మంత్రులైనా సరే ఉంటే వదిలిపెట్టవద్దని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించవద్దని చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. 
 
ఇటీవలికాలంలో హైదరాబాద్ నగరం డ్రగ్స్‌ కేంద్రంగా మారిపోయింది. దీనికి సంబంధించిన డ్రగ్స్ దందా కూడా తాజాగా వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్, పోలీసు అధికారులతో సీఎం కేసీఆర్ ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 3గంటలపాటు జరిగిన ఈ భేటీలో డ్రగ్స్ రాకెట్‌పై సుదీర్ఘంగా చర్చించారు. 
 
ముఖ్యంగా డ్రగ్స్ కేసు దర్యాప్తులో దూకుడు పెంచాలని, అధికార పార్టీకి చెందిన నాయకులు, మంత్రులకు కనున ఈ వ్యవహారంతో సంబంధాలు ఉంటే  తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.. హైదరాబాద్‌లో డ్రగ్స్ వాడకం, దందా ఎప్పటి నుంచో ఉన్నాయని, దీనిని పూర్తిగా రూపుమాపేందుకు అధికారులు కృషి చేయాలని, హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని, ఈ నగరం బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలని కేసీఆర్ సూచించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments