Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికుంది: కిషన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (15:58 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికి మాత్రమే ఉందని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రైతాంగం సమస్యలను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. 
 
మెదక్ జిల్లా గజ్వేల్ బహిరంగసభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ హైదరాబాదులో కూర్చుని జిల్లాలను సింగపూర్, లండన్ చేస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రుణమాఫీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. 
 
జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ విమర్శలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. మూడు పార్టీలు మారిన మైనంపల్లి హన్మంతరావును టీఆర్ఎస్లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
టీఆర్ఎస్లో చేరిన వారిని పవిత్రులు అనడం, బీజేపీలో చేరినవారిని పాపులు అనడం టీఆర్ఎస్ వారికి పరిపాటిగా మారిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తాజాగా జగ్గారెడ్డి బీజేపీలో చేరడం అదేదో ఘోరమైన విషయంలా టీఆర్ఎస్ నాయకులు చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments