Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం... పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి... ఎక్కడ?

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాయి. కానీ, ఈ నిధులు ఏమవుతున్నాయో ఆ ఆస్పత్రి వైద్యులకే ఎరుక. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్ల

Webdunia
గురువారం, 12 జులై 2018 (09:28 IST)
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాయి. కానీ, ఈ నిధులు ఏమవుతున్నాయో ఆ ఆస్పత్రి వైద్యులకే ఎరుక. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడుపోసుకునే పసికందులకు రక్షణ లేకుండా పోయింది.
 
తాజాగా అపుడు పుట్టి ప్రాణాలు కోల్పోయిన ఓ పసికందు మృతదేహాన్ని ఎలుకలు పీక్కుతిన్నాయి. ఈ దారుణం దేశంలోనే రెండో ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. 
 
స్థానిక డోర్నకల్ మండలానికికి చెందిన శాంతి అనే మహిళ ప్రభుత్వ సీకేఎం ఆసుపత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, దురదృష్టవశాత్తు పుట్టిన పసికందు వెంటనే చనిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఆ పసికందు మృతదేహాన్ని మార్చురీ లేకపోవడంతో డబ్బాపెట్టెలో పెట్టి భద్రపరిచారు. దీంతో ఎలుకలు ఆ పసికందు భౌతికకాయాన్ని పీక్కుతిన్నాయి. ఈ ఘటనపై పసికందు బంధువులు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దారుణం బుధవారం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments