Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ ఎగ్జామ్స్ క్లాష్: ఇంటర్ పరీక్షల తేదీల్లో మళ్లీ మార్పులు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (19:22 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల తేదీలు మారనున్నాయి. జేఈఈ ఎగ్జామ్స్ తేదీలతో క్లాష్ కావడంతో రీషెడ్యూల్ చేసిన అధికారులు కొత్త తేదీలను విడుదల చేశారు. అయితే ఈ కొత్త తేదీలు రీ షెడ్యూల్ చేసిన ఇంటర్, తెలంగాణ ఎగ్జామ్స్ తేదీలు మళ్లీ క్లాష్ అయ్యాయి.
 
దీంతో తెలంగాణ, ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలు మళ్లీ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్ మొదటి విడత ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తెలంగాణలో ఏప్రిల్ 22న ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమై మే 7న ముగియనున్నాయి.
 
ఇంకా ఏపీ విషయానికి వస్తే అక్కడ ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 22న ప్రారంభమై మే 7న ముగియనున్నాయి. అయితే.. ఇంటర్ ఎగ్జామ్స్, జేఈఈ ఎగ్జామ్స్ ఒకేసారి ఉండడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలు, ప్రిపరేషన్ విషయంలో ఇబ్బందులు పడే పరిస్థతి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించిన తేదీలను మార్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో హనీమూన్ ఎక్స్ ప్రెస్ : చిత్ర యూనిట్

కోలీవుడ్‌లో విషాదం : 'మహారాజ' నటుడు ప్రదీప్ కన్నుమూత

చంద్రబాబు గారిని కలిసి కుప్పం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశానని ని చెప్పా : హీరో సుధీర్ బాబు

సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర గ్రాండ్ రిలీజ్

మమ్ముట్టితో సమంత యాడ్ ఫిల్మ్

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

ఉడికించిన కూరగాయలు ఎందుకు తినాలో తెలిపే 8 ప్రధాన కారణాలు

ఈ 7 పదార్థాలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి, ఏంటవి?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments