Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటెండర్ టిఫిన్ తీసుకొచ్చేలోపు ఆత్మహత్య చేసుకున్న తాహసీల్దారు

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (13:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరావు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పెదబయలు మండల తాహసీల్దారు ఆత్మహత్య చేసుకున్నాడు. అటెండర్ టిఫిన్ తీసుకొచ్చేలోపు తన కార్యాలయంలోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
గురువారం జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, పెదబయలు మండల తాహసీల్దారుగా శ్రీనివాస రావు పని చేస్తున్నారు. ఈయన గురువారం ఉదయం ఎప్పటిలాగానే విధులకు వెళ్లారు. ఆ తర్వాత అటెండర్‌ను పిలిచి టిఫిన్ తీసుకుని రావాలని చెప్పడంతో అటెండర్ బయటకు వెళ్లి టిఫిన్ తెచ్చేలోపు శ్రీనివాస రావు కనిపించలేదు. 
 
దీంతో ఆ ప్రాంతమంతా గాలించగా, పక్కనే ఉన్న ఒక షెడ్డులో ఆయన ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఇతర అధికారులకు, సిబ్బందికి, పోలీసులకు సమాచారం చేరవేశాడు. వారంతా వచ్చి చూడగా అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు నిర్దారించారు. దీంతో మండల కేంద్రంలో విషాదం నెలకొంది. 
 
ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియకపోయినప్పటికీ ఇటీవల ఆయన జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఒక సమీక్షకు వెళ్లారు. ఈ సందర్భంగా భూముల సర్వే విషయంలో ఆయనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ విషాదకర నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments