Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో వెళుతుండగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీవ దహనం

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (10:31 IST)
తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం జరిగింది. కారులో వెళుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీహదహనమయ్యాడు. చంద్రగిరి మండలంలోని నాయుడుపేట - పూతలపట్టు రోడ్డులో గంగుడుపల్లె వద్ద ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు సజీవ దహనం చేశారు. కారులో ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆవ్యక్తి కారులోనే సజీహ దహనమైపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 
 
అయితే, మృతదేహా గుర్తుపట్టలేనిస్థితిలో ఉండటంతో కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు. కారులో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నాగరాజుగా గుర్తించారు. 
 
బెంగళూరులోని ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి బ్రాహ్మణపల్లికి వస్తుండగా శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత కారును దుండగులు ఆపి ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. సజీవ దహనం చేయడానికి గల కారణాలేంటనే దానిపై విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments