Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో వెళుతుండగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీవ దహనం

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (10:31 IST)
తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం జరిగింది. కారులో వెళుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీహదహనమయ్యాడు. చంద్రగిరి మండలంలోని నాయుడుపేట - పూతలపట్టు రోడ్డులో గంగుడుపల్లె వద్ద ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు సజీవ దహనం చేశారు. కారులో ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆవ్యక్తి కారులోనే సజీహ దహనమైపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 
 
అయితే, మృతదేహా గుర్తుపట్టలేనిస్థితిలో ఉండటంతో కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు. కారులో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నాగరాజుగా గుర్తించారు. 
 
బెంగళూరులోని ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి బ్రాహ్మణపల్లికి వస్తుండగా శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత కారును దుండగులు ఆపి ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. సజీవ దహనం చేయడానికి గల కారణాలేంటనే దానిపై విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments