Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి బుద్ధులు చెప్పాల్సిన టీచర్లే తన్నుకున్నారు.. గొడవకు ఎవరు బ్రేకేశారో తెలుసా?

విద్యార్థులకు మంచి బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే నువ్వా నేనా అంటూ జగడానికి దిగారు. అదీ విద్యార్థుల ముందే టీటర్లు కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (15:16 IST)
విద్యార్థులకు మంచి బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే నువ్వా నేనా అంటూ జగడానికి దిగారు. అదీ విద్యార్థుల ముందే టీటర్లు కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదంతా కడప జిల్లాలోని సుండుపలి మండలం రెడ్డివారి పల్లె ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య రాజకీయాలు జరుగుతున్నాయి. టీచర్లు రెండు వర్గాలుగా విడిపోయి.. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతున్నారు. విద్యార్థుల ముందే వాదులాటకు దిగేవారు. 
 
అది కాస్త శ్రుతిమించింది. బుధవారం స్కూలుకొచ్చిన టీచర్లు చిన్న విషయమై వాగ్వాదం చేసుకున్నారు. దీంతో ఒక వర్గం వారు ఇన్ ఛార్జ్ హెడ్ మాస్టర్ కదిరి నాయకల్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ జగడం కాస్త తన్నుకునేంత వరకు పోయింది. అరుపులు, కొట్లాటలు చూసి భయపడిన విద్యార్థులు పరుగున వెళ్లి స్థానికులకు విషయం చేరవేశారు. దీంతో స్థానికులు రంగంలోకి దిగి ఉపాధ్యాయుల గొడవకు బ్రేక్ వేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments