Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ కార్యకర్తను పరుగెత్తించి కత్తులతో నరికి చంపారు...

Webdunia
బుధవారం, 29 మే 2019 (12:25 IST)
నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయి. ఈ నెల 23వ తేదీన వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నవ్యాంధ్రలో అధికార తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోగా, వైకాపా అధికారంలోకి వచ్చింది. ఆ మరుసటిరోజు నుంచే టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. టీడీపీ నేతల ఇళ్ళను, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. గత వారం రోజుల్లోనే నలుగురైదుగురు టీడీపీ కార్యకర్తలు హత్యలకు గురికాగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమలూరులో మంగళవారం రాత్రి టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఆయన్ను పరుగెత్తించి, పరుగెత్తించి కత్తులతో నరికి చంపారు. ఆయన తన ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా ఈ హత్య జరిగింది. ఆ తర్వాత దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. 
 
బుధవారం ఉదయం రోడ్డుపక్కన పడివున్న శ్రీనివాసులు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు సమాచారం చేరవేశారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. టీడీపీ కార్యకర్త హత్యతో మడమలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments