Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై రాళ్లదాడి చేసిన వైకాపా ఎమ్మెల్సీ అనుచరులు

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (09:41 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిర్వహించిన రోడ్‌షో‌లో కొందరు అగంతకులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో చంద్రబాబు సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడ్డాడు. అయితే, ఈ దాడికి పాల్పడింది ఎవరో టీడీపీ నేతలు బహిర్గతం చేశారు. రాళ్లదాడి చేసింది వైకాపా ఎమ్మెల్సీ అరుణ ప్రధాన అనుచరులైన పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్‌లు గుర్తించారు. వారికి సంబంధించిన ఫోటోలను టీడీపీ విడుదల చేసింది. రాళ్లు విసురుతున్న నిందితుల ఫోటోలను విడుదల చేసింది. 
 
తాజాగా ఈ దాడికి పాల్పడినవారు వైకాపాకు చెందినవారేనంటూ టీడీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని రాళ్లదాడికి పాల్పడినవారు పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్ అని టీడీపీ ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా వీరిద్దరూ వైకాపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రధాన అనుచరులేనని కూడా తెలిపింది. 
 
ఇందుకు సంబంధించిన ఫోటోలను టీడీపీ విడుదల చేసింది. ఓ విద్యుత్ స్తంభం ఎక్కిన కిషోర్, కార్తీక్‌లు రాళ్లు రువ్వగా, వారికి రాళ్లు అందించేందుకు కింద నిలుచుకున్న వారు రాళ్ళతో నిండి వున్న సంచుల ఫోటోలను కూడా టీడీపీ సదరు ఫోటోల్లో చూపించింది. అంతేకాకుండా, చంద్రబాబు లక్ష్యంగా రాళ్లదాడి జరిగిందని టీడీపీ ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments