Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం గళం విప్పితే వారు వేడుక చూశారు, టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (23:32 IST)
వైసిపి ఎంపిల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు. తిరుపతి వేదికగా మీడియాతో రామ్మోహన్ నాయుడుతో గల్లా జయదేవ్‌లు మాట్లాడారు. ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను ప్రశ్నించాం.. గట్టిగా కేంద్రాన్ని నిలదీశాం.
 
మేము పార్లమెంటులో గళం విప్పితే వైసిపి ఎంపిలు వేడుక చూస్తూ కూర్చున్నారు. అసలు మీరు ఎంపిలేనా అంటూ మండిపడ్డారు రామ్మోహన్ నాయుడు. జగన్‌కు కేసులంటే భయమని.. కేసుల నుంచి ఎలా బయటపడాలనేదే జగన్ ఆలోచన అంటూ విమర్సించారు. 
 
టిడిపి హయాంలోనే తిరుపతి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని.. వైసిపి అధికారంలోకి వచ్చాక తిరుపతిలో అసలు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చే వైసిపి నాయకులను ప్రజలు నిలదీయాలని.. టిడిపి అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
 
అలాగే మరో ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలంటే వైసిపికి అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్థి చేయాల్సిన బాధ్యత వైసిపి ఎంపీలకి లేదా అంటూ ప్రశ్నించారు. వైసిపి ఎంపిలతో పాటు వైసిపి ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని.. వారికి త్వరలోనే బుద్ధి చెబుతున్నారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments