Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపో మాపో జగన్ కేసులు కూడా మాఫీ.. సమాచారం వచ్చింది: బాబు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కావాలంటూ వైకాపా కేంద్రం అవిశ్వాసం ప్రవేశపెట్టనుంది. ఇందుకు టీడీపీ కూడా సై అంటోంది. దీంతో మోదీ సర్కారును గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చ

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (16:20 IST)
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కావాలంటూ వైకాపా కేంద్రం అవిశ్వాసం ప్రవేశపెట్టనుంది. ఇందుకు టీడీపీ కూడా సై అంటోంది. దీంతో మోదీ సర్కారును గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వైకాపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అంటున్న జగన్మోహన్ రెడ్డి తన కేసులను మాఫీ చేసుకునేందుకు పీఎంవో చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ- వైసీపీ కుమ్మక్కైయ్యాయని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పావుగా మారిపోయారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
 
ఇంకా తాము రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంపై పోరాటం చేస్తుంటే వైసీపీ నేతలు పీఎంవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.  పీఎంవోలో జగన్ అనుచరులు వున్నారని.. రేపో మాపో జగన్ కేసులు కూడా మాఫీ కావొచ్చుననే సమాచారం అందిందని చంద్రబాబు చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని.. ఎన్డీఏ నుంచి బయటికి రావడం ద్వారా జనసేన, వైసీపీ, బీజేపీల మహా కుట్రను బయటపెట్టామని చంద్రబాబు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments