Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగవీటి రాధపై దాడి జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (10:09 IST)
టీడీపీ నేత వంగవీటి రాధాను టార్గెట్ చేసి హత్య చేయాలని చూస్తున్న నేపథ్యంలో, విచారణ చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండు చేశారు. ఆయ‌న డీజీపీ గౌతం స‌వాంగ్ కు లేఖ రాశారు. 
 
 
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి భయనకంగా ఉంద‌ని, బెదిరింపులు, దాడుల‌ పరంపర కొనసాగుతోంద‌న్నారు. తాజాగా విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధాను టార్గెట్‌ చేశార‌ని, కొంతమంది తనపై దాడి చేయడానికి తనను వెంబడిస్తూ, రెక్కీ నిర్వహించారని రాధ చెప్పార‌ని అన్నారు. పట్టపగలే ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో జంగిల్‌ రాజ్, గూండా రాజ్‌ పాలన కొనసాగుతున్న వాస్తవాన్ని ఎత్తిచూపుతున్నాయ‌న్నారు. 
 
 
పారదర్శకంగా విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చూడటం అత్యవసరం అని, గతంలో జరిగిన చట్టవిరుద్ధమైన, హింసాత్మక సంఘటనలపై ఎటువంటి చర్యలు తీసుకోనందు వ‌ల్ల‌నే ఇటువంటి సంఘటనలు పదే పదే పునరావృతమవుతున్నాయ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. వంగవీటి రాధపై దాడి జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. నేరస్థులపై తీసుకునే కఠినమైన చర్యలు మాత్రమే గూండా రాజ్ నుండి రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులు రక్షించబడతాయ‌న్నారు.
 
 
వంగవీటి రాధపై రెక్కీ వ్యవహారంపై ఒత్తిడులకు తలొగ్గకుండా త్వరితగతిన, పారదర్శకంగా విచారణ జరిపి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులకు శిక్ష పడేలా చూడాల‌ని నారా చంద్ర‌బాబు డిజిపిని కోరారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments