Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాలు.. టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా : రైల్వే అధికారులపై రాయపాటి ఫైర్

రైల్వే అధికారులపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒంటికాలిపై లేచారు. రుచికరమైన భోజనం, రవాణా టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా అనంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే రైల్వ

Webdunia
మంగళవారం, 9 మే 2017 (14:14 IST)
రైల్వే అధికారులపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒంటికాలిపై లేచారు. రుచికరమైన భోజనం, రవాణా టిక్కెట్ల కోసం మీటింగ్‌లకు వస్తారా అనంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే రైల్వే అధికారులు ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉన్నారన్నారు. 
 
తమ ప్రాంతంలోని రైల్వే సమస్యలపై ఆయన దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ రాయపాటి మాట్లాడుతూ... రైల్వే అధికారులు చిన్నచిన్న పనులు కూడా చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే ప్రజలు తమను చెప్పులతో కొడతారని వ్యాఖ్యానించారు. భోజనం, టిక్కెట్ కోసం సమావేశాలకు వస్తారా అని మండిపడ్డారు.
 
తాను మాట్లాడితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందని, అయినప్పటికీ తాను మాట్లాడుతానని చెప్పారు. రైల్వే అధికారులు ప్రధాని కన్నా పవర్ ఫుల్ అని వ్యాఖ్యానించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలుత రైల్వేజోన్ రావాల్సి ఉందని రాయపాటి అన్నారు. రైల్వే జోన్ రాకపోవడానికి అధికారులే కారణమని రాయపాటి ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments