Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రమేష్ 'ఉక్కు' దీక్ష - క్షీణిస్తున్న ఆరోగ్యం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఆయన ఆరోగ్యం క్షీణ

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (13:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయన మాత్రం ఉక్కు సంకల్పంతో దీక్షను కొనసాగిస్తున్నారు.
 
దీంతో ఆయనకు శనివారం వైద్యులు పరీక్షలు చేశారు. కడప రిమ్స్ వైద్య బృందం ఈ పరీక్షలు నిర్వహించింది. ప్రస్తుతం సీఎం రమేష్ చాలా నీరసంగా ఉన్నారని, షుగర్ లెవల్స్ తగ్గాయని, బీపీ కూడా తగ్గుతోందని తెలిపారు. 
 
మరోవైపు, రమేష్ దీక్షకు మద్దతిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం ఎమ్మెల్యేలు బొండా ఉమ, ప్రభాకర్ చౌదరి, సాయినాథ్ గౌడ్ తదితరులు కడపకు వచ్చి రమేష్, రవిలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వాకబు చేశారు. కాగా, సీఎం రమేష్‌తో పాటు.. ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఈ దీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments