Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్ బోర్డింగ్ కౌంటర్ సిబ్బందిపై జేసీ దివాకర్ వీరంగం.. ప్రయాణాలపై నిషేధం తప్పదా?

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ బోర్డింగ్ కౌంటర్ సిబ్బందిపై తన ప్రతాపం చూపించారు. చివరి నిమిషంలో వచ్చిన తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలంటూ ఒత్తి

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (14:15 IST)
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ బోర్డింగ్ కౌంటర్ సిబ్బందిపై తన ప్రతాపం చూపించారు. చివరి నిమిషంలో వచ్చిన తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలంటూ ఒత్తిడి చేశారు. అయితే, సమయం మించిపోయిందని చెప్పిన సిబ్బంది కౌంటర్ మూసివేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జేసీ... కౌంటర్‌లోని టిక్కెట్ ప్రింటింగ్ యంత్రాన్ని పగులగొట్టారు. ఈ సంఘటన గురువారం ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. బోర్డింగ్‌ పాస్‌ జారీ సమయం ముగియడంతో సిబ్బంది కౌంటర్‌ను ముసేశారు. తనకు బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వాలని సిబ్బందితో ఆయన వాదనకు దిగారు. సమయం ముగిసిందని ఇవ్వడం కుదరదని చెప్పడంతో దివాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. బోర్డింగ్‌ పాస్‌ ప్రింటర్‌ను విసిరేసి వీరంగం సృష్టించారు. జేసీ చర్యతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. ఆయనపై ఉన్నతాధికారులకు ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు చేశారు.
 
కాగా, ఇటీవల ఎయిర్ ఇండియా మేనేజర్‌పై దాడి చేసిన వ్యవహారంలో శివసేన రవీంద్ర గైక్వాడ్‌ను విమానాల్లో ప్రయాణించకుండా ఎయిరిండియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని ప్రైవేటు విమాన సంస్థలు కూడా అమలు చేశాయి. దీంతో దిగివచ్చిన గైక్వాడ్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఆయనపై నిషేధం తొలగించారు. ఇపుడు ఎయిర్‌పోర్టులో దౌర్జన్యం చేసిన జేసీ దివాకర్ రెడ్డిపై కూడా ఇలాంటి చర్యలే తీసుకోవచ్చన్న పలువురు అభిప్రాయపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments