Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్థిక ఉగ్రవాది'ని ప్రధాని కలుసుకోవడం దురదృష్టకరం : టీడీపీ ఎమ్మెల్సీ

ఆర్థిక ఉగ్రవాదిగా ముద్రపడిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం దురదృష్టకరమని అధికార టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన గురువారం విజయవాడల

Webdunia
గురువారం, 11 మే 2017 (16:28 IST)
ఆర్థిక ఉగ్రవాదిగా ముద్రపడిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం దురదృష్టకరమని అధికార టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన గురువారం విజయవాడలో మాట్లాడుతూ..... ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు. ఎండల నుంచి తప్పించుకునేందుకు అక్కడకు వెళ్లారంటూ మాట్లాడటం జగన్‌ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. 
 
ఆదాయానికి మించి ఆస్తులు, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదైన నేతల కేసులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్లో త్వరగా పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన మరుసటి రోజే జగన్‌ ఢిల్లీకి వెళ్లి ప్రధానిని శరణు కోరడం గమనార్హమన్నారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులో ఒక న్యాయమూర్తిని నియమించి శిక్షలు విధించాలని, ఆరు నెలల్లోపు విచారణలు పూర్తి కావాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని వైవీబీ గుర్తు చేశారు. ఈ కేసుల నుంచి బయటపడేందుకే ప్రధాని వద్దకు జగన్ పరుగుపెట్టారని ఆయన ఆరోపించారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments