Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దుల ర్యాలీలకు తెరలేపిన శ్రీ జగన్‌గారు : బుద్ధా వెంకన్న

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (12:07 IST)
తన తండ్రి హయాంలో సంపాదించిన సొమ్మునంతా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే, ఆదాయపన్ను శాఖ, సీబీఐ అధికారులు అటాచ్ చేశారనీ, అలా పోయిన డబ్బునంతా తిరిగి రాబట్టుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఎత్తుగడ వేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"గతంలో దోచుకున్న సొమ్ము అంతా సీబీఐ, ఈడీ అటాచ్మెంట్ చేసేసరికి మూడు రాజధానుల పేరుతో కొత్త ఎత్తుగడ వేసారు వైఎస్. జగన్‌గారు. బినామిల పేరుతో విశాఖలో భారీ భూకుంభకోణానికి తెరలేపారు. మరో రూ.50 వేల కోట్లు కొట్టేయడానికి మూడు రాజధానులు ముద్దు అంటూ మరోసారి తన మార్క్ ముద్దుల ర్యాలీలకు తెరలేపాడు. 
 
విశాఖలో జరుగుతున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆధారాలతో సహా బయటకు రావడం ఖాయం. వడ్డీతో సహా జగన్‌గారు, 8 నెలల నుండి విశాఖలో ఉండి ల్యాండ్ మాఫియా కింగ్‌పిన్‌గా మారిన వైఎస్ రెడ్డి భవిష్యత్‌లో ఊచలు లెక్కపెట్టడం ఖాయం" అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments