Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దుల ర్యాలీలకు తెరలేపిన శ్రీ జగన్‌గారు : బుద్ధా వెంకన్న

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (12:07 IST)
తన తండ్రి హయాంలో సంపాదించిన సొమ్మునంతా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే, ఆదాయపన్ను శాఖ, సీబీఐ అధికారులు అటాచ్ చేశారనీ, అలా పోయిన డబ్బునంతా తిరిగి రాబట్టుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఎత్తుగడ వేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"గతంలో దోచుకున్న సొమ్ము అంతా సీబీఐ, ఈడీ అటాచ్మెంట్ చేసేసరికి మూడు రాజధానుల పేరుతో కొత్త ఎత్తుగడ వేసారు వైఎస్. జగన్‌గారు. బినామిల పేరుతో విశాఖలో భారీ భూకుంభకోణానికి తెరలేపారు. మరో రూ.50 వేల కోట్లు కొట్టేయడానికి మూడు రాజధానులు ముద్దు అంటూ మరోసారి తన మార్క్ ముద్దుల ర్యాలీలకు తెరలేపాడు. 
 
విశాఖలో జరుగుతున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆధారాలతో సహా బయటకు రావడం ఖాయం. వడ్డీతో సహా జగన్‌గారు, 8 నెలల నుండి విశాఖలో ఉండి ల్యాండ్ మాఫియా కింగ్‌పిన్‌గా మారిన వైఎస్ రెడ్డి భవిష్యత్‌లో ఊచలు లెక్కపెట్టడం ఖాయం" అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments