Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా శవం కూడా చంద్రబాబుతోనే ఉంటుంది : బుద్ధా వెంకన్నా

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (11:54 IST)
తాను పార్టీ మారబోతున్నట్టు సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నా క్లారిటీ ఇచ్చారు. ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు తాను టీడీపీ అధినేత చంద్రబాబుతోనే ఉంటానని పునరుద్ఘాటించారు. వైకాపాకు చెందిన అల్లరి మూక సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దుష్ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. 
 
తాను పార్టీ మారబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై బుద్ధా వెంకన్నా స్పందిస్తూ, తనకు పార్టీ మారాలాన్న ఆలోచన ఏదీ లేదన్నారు. కొందరు కావాలనే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను బతికివున్నంత వరకు టీడీపీతోనే ఉంటానని, చంద్రబాబుతోనే కలిసి పని చేస్తానని చెప్పి, తన గురించి సాగుతున్న పుకార్లకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. 
 
కాగా, ఇటీవల విజయాడలోని ఎన్.ఏ.సి. కళ్యాణమండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బుద్ధా వెంకన్న ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు నొచ్చుకున్నారు. పైగా వేదికపైకి వెళ్లొద్దంటూ వారు వారించారు. దీంతో ఆయన కన్నీరు పెట్టుకుని సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. అంతే, ఆయన టీడీపీని వీడబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments