కాంగ్రెస్ తలుపులు మూసి చేస్తే.. బీజేపీ తలుపులు తెరిచే ముంచేసింది : టీడీపీ ఎమ్మెల్యే

పార్లమెంట్ తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేస్తే, ఇపుడు అధికారంలో ఉన్న బీజేపీ తలుపులు తెరిచే నిలువునా అన్యాయం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (16:36 IST)
పార్లమెంట్ తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేస్తే, ఇపుడు అధికారంలో ఉన్న బీజేపీ తలుపులు తెరిచే నిలువునా అన్యాయం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల విత్తమంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం చేసిన విషయం తెల్సిందే. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. 
 
తలుపులు మూసి విభజన బిల్లుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు సమాధి కట్టారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే, బీజేపీ కూడా ఇపుడు తలుపులు తెరిచి అన్యాయం చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు.
 
ఇకపోతే, మరో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీప్రభుత్వంపై తమ భ్రమలు పటాపంచలయ్యాయన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రతి సీమాంధ్రుడి గుండె రగలిపోతోందన్నారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని, ఇంకా బీజేపీని పట్టుకుని వేలాడటం సరికాదన్నారు. తెగదెంపులపై పదిరోజుల్లో ఏదోఒకటి తేలిపోతుందని, ఓపిక నశిస్తే తెలుగువారు తిరగబడతారని బుచ్చయ్యచౌదరి హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments