Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు షాక్ : వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 15 జనవరి 2019 (14:30 IST)
సంక్రాంతి సంబరాల కోసం తన స్వగ్రామం నారావారి పల్లెకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు తేరుకోలేని షాకివ్వనున్నారు. రాజంపేటకు చెందిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి అధికార పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. 
 
గత కొంతకాలంగా పార్టీ అధినేత చంద్రబాబుపై మల్లిఖార్జున రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే, స్థానిక టీడీపీ నేతలు కూడా ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదు. దీంతో ఆయన రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉండే వైకాపాలో చేరేందుకు ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆయన ఈనెలాఖరులో టీడీపీకి రాజీనామా చేసి జగన్ చెంతకు చేరాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
ఇదే అంశంపై వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో మంతనాల తర్వాత మేడా మల్లిఖార్జునరెడ్డి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం సాగుతోంది. రాజంపేట వైసీపీ నేతలతోనూ ఆయన సంప్రదింపులు జరిపినట్టు సమాచారం అందుతుండగా... పార్టీ మారేందుకు ఆయన కుటుంబ సభ్యులు సుముఖంగానే ఉన్నారంటున్నారు. అయితే, తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఉండటంలేదని కొంత కాలంగా మేడా మల్లిఖార్జునరెడ్డి అసంతృప్తి ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments