Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు షాక్ : వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 15 జనవరి 2019 (14:30 IST)
సంక్రాంతి సంబరాల కోసం తన స్వగ్రామం నారావారి పల్లెకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు తేరుకోలేని షాకివ్వనున్నారు. రాజంపేటకు చెందిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి అధికార పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. 
 
గత కొంతకాలంగా పార్టీ అధినేత చంద్రబాబుపై మల్లిఖార్జున రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే, స్థానిక టీడీపీ నేతలు కూడా ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదు. దీంతో ఆయన రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉండే వైకాపాలో చేరేందుకు ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆయన ఈనెలాఖరులో టీడీపీకి రాజీనామా చేసి జగన్ చెంతకు చేరాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
ఇదే అంశంపై వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో మంతనాల తర్వాత మేడా మల్లిఖార్జునరెడ్డి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం సాగుతోంది. రాజంపేట వైసీపీ నేతలతోనూ ఆయన సంప్రదింపులు జరిపినట్టు సమాచారం అందుతుండగా... పార్టీ మారేందుకు ఆయన కుటుంబ సభ్యులు సుముఖంగానే ఉన్నారంటున్నారు. అయితే, తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఉండటంలేదని కొంత కాలంగా మేడా మల్లిఖార్జునరెడ్డి అసంతృప్తి ఉన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments