Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం.. రాజీనామాలకు గంట పిలుపు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (18:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణమైన విశాఖ ఉక్కు కర్మాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇవి రాష్ట్రంలో కలకలం రేపాయి. దీనిపై తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు స్పందించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం అవుతుందనే వార్త యావత్‌ రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురిచేసిందన్నారు. 
 
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరంకాకుండా అడ్డుకునేందుకు అవసరమైతే ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం కావాలన్నారు. 'రాజకీయాలు, పార్టీలకు అతీతంగా స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎందరో ప్రాణ త్యాగాలతో ఆనాడు ఉక్కు కర్మాగారం సాధించాం. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు లేవని కుంటిసాకు చూపి ప్లాంట్‌ని వంద శాతం ప్రైవేటుపరం చేయడం దారుణం. 
 
ఈ విషయంలో కేంద్రం ఆలోచన సరైంది కాదు. అనేక ప్రైవేటు సంస్థలకు రాష్ట్రంలో ఉన్న ఐరన్‌వోరు గనులు ఇస్తున్నందున.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఈ మేరకు గనులు కేటాయించి నష్టాలు తగ్గించుకునే వెసులుబాటు కల్పించాలి. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించాలి. అవసరమైతే ప్రధానిని కలిసి స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా చూడాలి' అని ఈ మాజీ మంత్రి డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments