Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడు రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్లే ఓటు మురిగిపోయింది.. ఎమ్మెల్యే భవానీ

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (16:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా తరపున పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు సంపూర్ణ మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ తరపున పోటీ చేసిన వర్ల రామయ్య మాత్రం ఓడిపోయారు. అయితే, ఈ ఎన్నికల్లో తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, అది చెల్లలేదు. ఆమె చేసిన చిన్న తప్పు వల్ల ఆ ఓటు మురిగిపోయింది. దీనిపై తెదేపా ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. 
 
రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో ఎలా ఓటు వేయాలో ముందే శిక్షణ ఇచ్చినా, తాను పోలింగ్ సమయంలో పొరబడ్డానని తెలిపారు. ఒకటి అని వేయాల్సిన చోట టిక్ మార్క్ పెట్టానని వెల్లడించారు. ఈ విషయంలో తనదే పొరపాటు అని స్పష్టం చేశారు.
 
పైగా, రాజ్యసభ ఎన్నికల పోలింగులో పాల్గొనడం ఇదే మొదటిసారి అని, అయితే, అక్కడున్న సిబ్బందిని టిక్ పెట్టవచ్చా అని అడిగితే వారు ఓకే చెప్పారని, దాంతో టిక్ పెట్టానని వివరించారు. 
 
ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియజేశానని భవాని వెల్లడించారు. లోపల ఉన్న సిబ్బందిలో ఓ వ్యక్తి తాను అడిగినప్పుడు తెలియదు అని చెప్పివుంటే తమ ఏజెంట్లను అడిగి సందేహ నివృత్తి చేసుకునేదాన్నని, అతడు రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో తాను కూడా తప్పుగా టిక్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments