Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి మహానాడుకు తరలిరండి : మంత్రి నారాయణ

Webdunia
బుధవారం, 25 మే 2016 (16:28 IST)
తిరుపతిలో ఈనెల 27, 28, 29తేదీలలో జరిగే మహానాడుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. మహానాడు పనులను నెహ్రూ మున్సిపల్‌ సభాస్థలిలో మంత్రి నారాయణ పరిశీలించారు. స్థానిక నాయకులతో నారాయణ సమీక్షించారు. అలాగే మహానాడుకు వచ్చే వాహనాల పార్కింగ్‌ విషయంపై పోలీసులతో చర్చించారు. 
 
ఈ మహానాడు కారణంగా తిరుపతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పోలీసులను, స్థానిక అధికారులను కోరారు. అలాగే, సభాస్థలి మొత్తాన్ని పరిశీలించిన నారాయణ జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 30 వేల మందికిపైగా టిడిపి నాయకులు, కార్యకర్తలు మహానాడుకు తరలివస్తారని అంచనాకు వచ్చామన్నారు. అందుకు అందరికీ సరిపోయేలా సభాస్థలిని ఏర్పాటు చేశామన్నారు. 
 
అయితే మారుమూల ప్రాంతంలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూడా తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ పండుగగా దీన్ని ప్రతి ఒక్కరు భావించాలని, మహానాడులో తీసుకునే కీలక నిర్ణయాలన్నింటినీ ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని పిలుపు నిచ్చారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments