Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రోన్‌ ఘటన అనుమానాలకు తావిస్తోంది : తెదేపా నేతల ఫిర్యాదు

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (14:33 IST)
తెదేపా అధినేత చంద్రబాబు నివాసంపై డ్రోన్‌ ఎగురవేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఆ పార్టీ నేతలు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను రాజ్‌భవన్‌లో కలిసి ఫిర్యాదు చేశారు. నాలుగు పేజీల లేఖను గవర్నర్‌కు అందజేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో చంద్రబాబు భద్రతను కుదించిన ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాల తర్వాత తిరిగి భద్రతను పెంచడాన్ని తెదేపా నేతలు ఈ సందర్భంగా గవర్నర్‌కు గుర్తు చేశారు. 
 
వైకాపా ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పూనుకొంటోందని, డ్రోన్‌ ఎగరవేస్తూ పట్టుబడిన వ్యక్తి జగన్‌ నివాసంలో ఉండే కిరణ్‌ ఆదేశాలమేరకే చిత్రీకరించానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని తెదేపా నేతలు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 
 
గవర్నర్‌ను కలిసిన వారిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, గల్లా జయదేవ్‌, టీడీఎల్పీ ఉపనేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామారావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుతో సహా 15 మంది సభ్యుల బృందం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. డ్రోన్‌ అంశంపై ఇప్పటికే గుంటూరు ఐజీకి తెదేపా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments