Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ తమ్ముళ్లు ఆ విధంగా 'గుర్రు'పెట్టి ముందుకు పోతున్నారు...(Video)

Webdunia
శనివారం, 28 మే 2016 (16:44 IST)
తిరుపతిలో జరుగుతున్న మహానాడులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు తీస్తున్న కునుకుపాట్లు అన్నీఇన్నీ కావు. నిన్నటి నుంచి నిరంతరాయంగా మహానాడు జరుగుతుండటంతో నిద్రలేకుండా నాయకులు సభలోనే తూలుతున్నారు. ప్రధానంగా ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు, రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్‌లు మహానాడులో నిద్రపోతూనే కనిపించారు.
 
నిద్రపోతున్న సీనియర్‌ నేతలను చూసిన కార్యకర్తలు కాసేపు నవ్వుకున్నారు. మహానాడు వంటి కార్యక్రమంలో నేతలు నిద్రపోవడం ఏంటో అర్థం కాక మరికొంతమంది సీనియర్‌ నేతలు ఆలోచిస్తూ ఉండిపోయారు. 
 
శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు మహానాడు కొనసాగుతుండడంతో పాటు శనివారం ఉదయాన్నే తిరుమల శ్రీవారిని పలువురు సీనియర్ నేతలు దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే త్వరగా లేచి దర్శనానికి వెళ్ళడంతోనే వారికి నిద్రలేకుండా పోయిందని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 
తిరుపతిలో పరిటాల సునీత పుట్టినరోజు 
మరోవైపు.. తిరుపతిలో పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పరిటాల అభిమానుల మధ్య ఆమె పుట్టినరోజు వేడుకులను చేసుకున్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సునీత నేరుగా తిరుచానూరులోని తమ బంధువుల ఇంటికి వెళ్ళారు. అక్కడ కేక్‌ చేసిన సునీత బంధువుల మధ్య వేడుకలను జరుపుకున్నారు. అధికసంఖ్యలో పరిటాల అభిమానులు పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. 
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments