మల్లెల పద్మనాభరావు కు చంద్రబాబు నివాళి

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (12:26 IST)
ఇబ్రహీంపట్నం టిడిపి సీనియర్ నాయకులు ఇబ్రహీంపట్నం మాజీ సర్పంచ్ శ్రీ మల్లెల అనంత పద్మనాభరావు (91) ఆయన స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన భౌతిక కాయనికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూలమాల వేసి, తెలుగుదేశం కండువాకప్పి నివాళులర్పించారు. 
 
కాగా, మల్లెల పద్మనాభరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఆరుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. ఆయన 1928లో మల్లెల కొండయ్య మహా లక్ష్మి దంపతులకు. ఆయన బీఏ వరకు చదువుకున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బోర్డ్ డైరెక్టరుగా మూడు పర్యాయాలు పని చేశారు.
 
1952 నుంచి 48 సంవత్సరాల పాటు ఇబ్రహీంపట్నం గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన హయాంలో డాక్టర్ జాకీర్ హుస్సేన్ కళాశాల స్థలం, పంచాయతీ కార్యాలం స్థలాన్ని ప్రాథమిక సహకార సంఘం స్థలం దానంగా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 76 ఎకరాలు అంటే సుమారుగా రూ.200 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేశారు. మల్లెల పద్మనాభ రావు నగర్‌గా నామకరణం చేసి 1500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments