Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ కన్నుమూత

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వారం రోజుల నుంచి అనారోగ్యంతో భాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మృతిచెందార

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (07:12 IST)
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వారం రోజుల నుంచి అనారోగ్యంతో భాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మృతిచెందారు. ఆయనకు ఒక అబ్బాయి... ఒక అమ్మాయి ఉన్నారు.
 
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నెహ్రూ అసలుపేరు దేవినేని రాజశేఖర్‌. విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నెహ్రూ కంకిపాడు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒకసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ఎన్టీఆర్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.
 
దేవినేని మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం నెహ్రూ మృతదేహాన్ని విజయవాడకు తరలించనున్నారు. నెహ్రూ మరణ వార్తతో ఆయన అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments