Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేశ్‌కు సూసైడ్ నోట్.. ఇక సెలవు.. సేవ్ టీడీపీ అంటూ తెలుగుదేశం నేత ఆత్మహత్య..

టీడీపీ నేత ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణా జిల్లాలోని జి.కొండూరు మండలం గడ్డమడుగుకు చెందిన అప్పసాని ఈశ్వర్ టీఎన్ఎస్ఎఫ్ (తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్) అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ పార్టీ కోసం అహర్నిశలు

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (11:59 IST)
టీడీపీ నేత ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణా జిల్లాలోని జి.కొండూరు మండలం గడ్డమడుగుకు చెందిన అప్పసాని ఈశ్వర్ టీఎన్ఎస్ఎఫ్ (తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్) అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలను టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోందంటూ ఆవేదన చెందాడు. అంతటితో ఆగకుండా టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా  లోకేష్‌కు సూసైడ్ నోట్ రాశాడు.
 
పార్టీ అభ్యున్నతి కోసం జీవితాంతం తాను పని చేశానని... తమకు పదవులు రాకపోయినా బాధపడలేదని అప్పసాని వాపోయారు. పదవి గురించి తాను పట్టించుకోలేదని.. ఐతే ఒకప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారు ప్రస్తుతం పార్టీలో చేరి నానా హంగామా సృష్టిస్తున్నారని అప్పసాని ఆ లేఖలో తెలిపారు. అలాంటి వారికి పార్టీ ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అప్పసాని వ్యాఖ్యానించారు. 
 
ఒకప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పని చేసి, ఇప్పుడు పార్టీలో చేరిన వారి నుంచి పార్టీని కాపాడాలని కోరుతూ సూసైడ్ నోట్ రాశారు. సేవ్ టీడీపీ... ఇక సెలవు అంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ లేఖను ఫేస్ బుక్‌లో కూడా అప్ లోడ్ చేశారు. అప్పసాని ఆత్మహత్య టీడీపీ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments