Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేసీ అబద్దాలు చెపుతున్నారు.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న పూసపాటి

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంపై కేంద్ర పౌరవిమానయానమంత్రి పూసపాటి అశోకగజప

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (14:38 IST)
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంపై కేంద్ర పౌరవిమానయానమంత్రి పూసపాటి అశోకగజపతిరాజు సీరియస్‌ అయ్యారు. ఈ వ్యవహారంలో జేసీ దివాకర్ రెడ్డి అబద్ధాలు చెపుతున్నారంటూ మండిపడ్డారు. 
 
ముఖ్యంగా వైజాగ్ ఎయిర్ పోర్టుకు గంట ముందే వచ్చానని దివాకర్ రెడ్డి చెప్పారని... కానీ, సీసీటీవీ ఫుటేజీలో అది అవాస్తవమని తేలిందని చెప్పారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. మరోవైపు, చిన్న చిన్న విషయాలు కూడా పార్టీ పరువును దిగజారుస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఇదిలావుండగా, జేసీ దివాకర్ రెడ్డిపై ఇండిగోతో పాటు.. ఏడు ఎయిర్ లైన్స్ సంస్థలు వేటు వేశాయి. దీంతో ఈ ఏడు విమానయాన సంస్థల్లో జేసీ ప్రయాణించేందుకు వీల్లేకుండా పోయింది. మరోవైపు... 'వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లో అసలు ఏం జరిగిందన్న వివరాలను తెలుసుకోవాల్సి ఉంది. దీనిపై చట్ట ప్రకారం నడుచుకుంటాం' అని అశోక్ గజపతి రాజు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments