Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఆర్ఆర్ కేసు : నేడు కూడా సీఐడీ విచారణకు హాజరుకానున్న నారా లోకేశ్

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (09:45 IST)
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్‌ను ఉద్దేశ్యపూర్వకంగా మార్పు చేసిన తనకు అయినవారికి ఆయాచిత లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వద్ద ఏపీ సీఐడీ అధికారుల తొలి రోజు విచారణ జరిపారు. రెండో రోజైన బుధవారం కూడా మరోమారు విచారణకు రావాలని 41ఏ కింద నోటీసు ఇచ్చారు. దీంతో ఆయన రెండో రోజు కూడా సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. 
 
కాగా, తొలి రోజున తన వద్ద జరిపిన విచారణలో మొత్తం 50 ప్రశ్నలు అడిగారని, అందులో 49 ప్రశ్నలు తనకు ఎలాంటి సంబంధం లేని ప్రశ్నలు వేశారని, చివరగా అంటే 50వ ప్రశ్నగా ఐఆర్ఆర్ అలైన్మెంట్ గురించి ప్రస్తావించారని నారా లోకేశ్ మీడియాకు వెల్లడించారు. అలాగే, రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు రావాలని 41ఏ కింద మళ్లీ నోటీసు ఇచ్చారని, రేపు కూడా విచారణకు హాజరవుతారనని చెప్పారు. 
 
నిజానికి ఈ కేసులో ఈ నెల 4వ తేదీనే లోకేశ్‌ను సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. అయితే, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోకేశ్‌ను మంగళవారం విచారణకు పిలిచారు. మొత్తం 50 ప్రశ్నలు అడిగారని చెప్పారు. మరింత సమాచారం కోసం రేపు మరోసారి విచారణకు రావాలని నారా లోకేశ్‌కు 41ఏ కింద నోటీసులు ఇచ్చారని, అందువల్ల తాను రేపు కూడా విచారణకు హాజరవుతానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments