Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసు : మాజీ మంత్రి నారాయణకు ఊరట

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (12:33 IST)
అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు చేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి.నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు గతంలో హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను మరో రెండు వారాల పాటు పొడగించింది. ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్‌లో ఉన్నారు. ఈ బెయిల్‌ను పొడగించాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. దీంతో మరో రెండు వారాల పాటు బెయిల్ పొడగిస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్ యజమాని బాబి, నారాయణ విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ రెండు వారాల పాటు ముందస్తు బెయిల్ పొడగించింది. జాబితాతో పాటు నారాయణ సంస్థల ఉద్యోగులకు ఆయనకు బినామీలుగా అసైన్డ్ భూములను రైతులను బెదిరించి కొనుగోలు చేశారని ఏపీసీఐడీ పోలీసుల కేసు నమోదు చేశారు. ఆ తర్వాత భూముల విలువ పెరగడంతో వీరు ఆయాచిత లబ్ది పొందారని ఆరోపించారు. ఈ కేసులోనే మాజీ మంత్రి నారాయణకు ఇచ్చిన బెయిల్‌ను మరో రెండు వారాల పాటు పొడగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments