Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసు : మాజీ మంత్రి నారాయణకు ఊరట

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (12:33 IST)
అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు చేసులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి.నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు గతంలో హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను మరో రెండు వారాల పాటు పొడగించింది. ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్‌లో ఉన్నారు. ఈ బెయిల్‌ను పొడగించాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. దీంతో మరో రెండు వారాల పాటు బెయిల్ పొడగిస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్ యజమాని బాబి, నారాయణ విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ రెండు వారాల పాటు ముందస్తు బెయిల్ పొడగించింది. జాబితాతో పాటు నారాయణ సంస్థల ఉద్యోగులకు ఆయనకు బినామీలుగా అసైన్డ్ భూములను రైతులను బెదిరించి కొనుగోలు చేశారని ఏపీసీఐడీ పోలీసుల కేసు నమోదు చేశారు. ఆ తర్వాత భూముల విలువ పెరగడంతో వీరు ఆయాచిత లబ్ది పొందారని ఆరోపించారు. ఈ కేసులోనే మాజీ మంత్రి నారాయణకు ఇచ్చిన బెయిల్‌ను మరో రెండు వారాల పాటు పొడగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments