Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్ఐ ఆత్మహత్య చేసుకునేలా చేశారు : దేవినేని ఉమ

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (12:16 IST)
గుడివాడలో పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్ఐ ఆత్మహత్య చేసుకునేలా చేశారని వైకాపా నేతలపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. అంతేకాకుండా ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ ఏం సాధించారంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
ఎన్టీఆర్ విగ్రహం ధర్నా చేసేందుకు యత్నించిన దేవినేని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై మాజీ మంత్రి దేవినేని స్పందిస్తూ, సీఎం జగన్‌.. ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. 
 
వైసీపీ ప్రభుత్వ పాలనలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. ఏపీ డీజీపీ సవాంగ్ వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా మారారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారులు రాష్ట్ర ప్రజల కోసం పని చేయడం లేదని, జగన్ కోసం పని చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments