Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు.. నిర్ణయం బాధ కలిగించింది : వర్ల రామయ్య

తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్‌తో పాటు టీడీపీ ల

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (15:26 IST)
తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్‌తో పాటు టీడీపీ లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడిగా ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్ పేర్లను ఆయన ఖరారు చేశారు. 
 
నిజానికి ఆ పార్టీ సాంస్కృతిక విభాగం ఎస్సీ నేత వర్ల రామయ్య పేరును పరిశీలించారు. అయితే, సామాజిక సమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషంలో వర్ల రామయ్య పేరును తొలగించి ఆయన స్థానంలో రవీంద్ర కుమార్ పేరును చేర్చి, రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. 
 
దీనిపై వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు బాధ కలిగించినప్పటికీ, అధినేత చంద్రబాబు ఆదేశం శిరోధార్యంగా భావిస్తానని చెప్పారు. కొందరు నేతలు వ్యవహరించినట్లు తాను పదవుల కోసం పార్టీ మారే రకం కాదని, చంద్రబాబుకు అండగా ఉండాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments