Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన... టీడీపీ చీఫ్ చంద్రబాబు

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (19:51 IST)
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు తొలగించారు. దీనిపై నలువైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అలాగే, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కూడా స్పందించారు. గుంటూరు మున్సిపల్ అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడిదలకేం తెలుసు గంధపు వాసన అనే సామెతను ఉటంకించారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
"గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని ఒక సామెత ఉంది. కరుడుకట్టిన దోపిడీ దొంగలకు దోచుకోవడం తప్ప కళల గురించి, కళాకారుల గురించి ఏం తెలుస్తుంది? అందుకే నిన్న ఎన్టీఆర్ వంటి మహానుభావుడిని అవమానించారు. ఈరోజు గాన గంధర్వుడిని అవమానించారు. 
 
ఎస్పీ బాలు గారు మన తెలుగువాడు అని చెప్పుకోవడమే మనకు గర్వకారణం. అటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అనుమతి లేదంటూ తొలగించడం... ఇంకా ఘోరంగా తొలగించిన విగ్రహాన్ని మరుగుదొడ్డిలో పెట్టడం తెలుగుజాతికే అవమానకరం. ఇది తెలిసి మనసు చివుక్కుమంది. 
 
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారిని అవమానించినందుకు ప్రభుత్వం వెంటనే తెలుగుప్రజలకు క్షమాపణ చెప్పి, బాద్యులపై చర్యలు తీసుకోవాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments