Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషి మనిషే.. దేవుడు దేవుడే... మనిషి దేవుడు కాలేడు : చంద్రబాబు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:59 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని విష్ణువుతో పోల్చిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా మండిపడ్డారు. ఆయన గురువారం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారం కోసం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవుడే దేవుడే... మనిషి మనిషే... మనిషి ఎప్పుడు దేవుడు కాలేడన్నారు. మనుషులను దేవుడితో పోల్చడం తప్పన్నారు. ఇప్పుడే కాదు... గతంలోనూ తిరుమలలో చాలా అపవిత్ర కార్యక్రమాలు జరిగాయన్నారు. 
 
పింక్ డైమండ్ మాయం వంటి ఆరోపణలు చేసిన వ్యక్తిని.. మళ్ళీ నియమించడం మంచి సాంప్రదాయం కాదన్నారు. అలా చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని సూచించారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. రాష్ట్రానికి అతి పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి అని పేర్కొన్నారు. 
 
తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అపవత్రాలకు పాల్పడిన వారిని తిరిగి శ్రీవారి సన్నిధిలో విధులకు నియమించడం అనేది అతిపెద్ద తప్పుగా చంద్రబాబు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రంలో కాకులు తల్వార్ లు పట్టినాయ్.

GV Prakash: జీవి ప్రకాష్‌ బద్దకిష్టా? ఎన్ని గంటలకు నిద్రలేస్తాడో తెలుసా !

మెగాస్టార్ డ్యాన్స్‌కు ఫిదా... ఆ తర్వాత డ్యాన్సర్ అయ్యాను : సాయి పల్లవి

విలన్లు, స్మగ్లర్లు హీరోలుగా చూపిస్తున్నారు: వెంకయ్య నాయుడు చురకలు

స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ ఆరోగ్యంగా ఉన్నారు.. తప్పుడు ప్రచారం వద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments