వైఎస్ విజ్ఞతను అభినదించాలి... జగన్ అహంభావి : చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (16:05 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. వైఎస్ విజ్ఞతతో కూడిన నేత అయితే, జగన్ అహంభావి అంటూ విమర్శలు గుప్పించారు. శుక్రవారం నాడు గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో బాబు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఐదు నెలల్లో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారన్నారు. ఇసుక కొరతతో 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. వర్షాకాలంలోనూ విద్యుత్ కోతలు విధిస్తున్నారన్నారు. 
 
'2007లో వైఎస్‌ పత్రికా స్వేచ్ఛను హరించేలా జీవో తెచ్చారు. నాడు విలేకర్లు, ఎడిటర్లు, రాజకీయపార్టీలు ఆందోళన చేశాయి. వైఎస్‌ భయపడి నాడు జీవో రద్దు చేశారు. వైఎస్‌ విజ్ఞతను మనం అభినందించాలి. వైఎస్‌ రద్దు చేసిన జీవోను జగన్‌ మళ్లీ తీసుకొచ్చారు. జీవో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జగన్‌ను హెచ్చరిస్తున్నాను. జగన్‌ గుర్తుంచుకోవాలి.. నాడు వైఎస్‌ చేసిన తప్పును సరిదిద్దుకున్నారు. జగన్‌కు అహంభావం. వివేకా కేసుపై మాట్లాడితే వర్ల రామయ్యకు నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఇంత మంది ఎస్పీలను, సిట్‌ను మార్చారు?. పోలీసులు మీసాలు తిప్పి తొడ గొడుతారా?' అని చంద్రబాబు మండిపడ్డారు.
 
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి గత ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని, విపక్ష నేతలను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఖజానాలో చిల్లిగవ్వలేకున్నా ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పాలన అవినీతి మయమంటూ ఆరోపించిన అధికార పార్టీ ఐదు నెలల కాలంలో కనీసం ఒక్కటైనా నిరూపించలేకపోయిందన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీరుపై ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments