Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులివెందుల గడ్డపై చంద్రబాబు ఫైర్.. చికెన్‌ కొట్టులోనూ వైకాపా ఎమ్మెల్యే వసూళ్లు

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (16:31 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తే, వైకాపా పాలనలో సీఎం జగన్‌ కేవలం రూ.2 వేల కోట్లే ఖర్చు చేశారని ఆరోపించారు.
 
'సాగునీటి ప్రాజెక్టుల సందర్శన'లో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. జమ్మలమడుగు సర్కిల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. ఈ సందర్భగా సీఎం జగన్‌, వైకాపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే చికెన్‌ కొట్టులోనూ వసూళ్లకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్‌కు ప్రజలను దోచుకోవాలనే తప్ప.. మేలు చేయాలనిలేదని విమర్శించారు. 
 
జగన్‌ కొత్తగా ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా? ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు. జమ్మలమడుగు ప్రజల కోసం తెదేపా నేత భూపేష్‌ పనిచేస్తారని చంద్రబాబు చెప్పారు. మరోవైపు, పులివెందులలో తెదేపా ఫ్లెక్సీలను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి నివాసానికి సమీపంలో ఇది జరిగింది. తెదేపా నాయకులు వారిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments