Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ దూరం

ఠాగూర్
మంగళవారం, 13 ఆగస్టు 2024 (11:34 IST)
ఉమ్మడి విశాఖపఖపట్టణం జిల్లాలో స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం జరుగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలవడం పెద్దకష్టం కాదని, అయినప్పటికీ హుందా రాజకీయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. చంద్రబాబు నిర్ణయంపై టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారని కొనియాడారు. కాగా, ఉప ఎన్నిక నామినేషన్లు  గడువు ముగియనుంది. 
 
కాగా, ఈ ఉప ఎన్నికల్లో వైకాపా తపపున సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. అలాగే, ఈ ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 60 శాతానికి పైగా వైకాపా నుంచి గెలిచినవారే. అయినప్పటికీ పోటీని నిలిపితే గెలిపిస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు.. కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే, అంత ప్రయాస అక్కర్లేదని, ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని, దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీలేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

రాయలసీమ అంటే ఏంటో రాచరికం సినిమా చూపిస్తుంది

విడుదలకు సిద్దమవుతున్న మిస్టీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments