Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం డుమ్మా?

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (06:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మార్చి నెలలో జరుగనున్నాయి. ఈ సమావేశాలకు డుమ్మా కొట్టాలని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టుగా ఉంది. ఇదే విషయాన్ని పలువురు టీడీపీ నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. 
 
మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలా? వద్దా? అనే అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా, గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా బాధపడి, ఇకపై ఈ సభలో ముఖ్యమంత్రి హోదాలోనే అడుగుపెడతానంటూ శపథం చేశారు. ఆ తర్వాత ఆయ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు మార్చిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై గురువారం పార్టీలోని ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించారు. ప్రజా సమస్యలు చాలా ఉన్నందుకు సమావేశాలకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీయాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు. 
 
అయితే, సమావేశాలకు హాజరైనప్పటికీ అధికారపక్షం సమయం ఇవ్వదని, అందువల్ల వెళ్ళడం అనససరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. దీంతో టీడీపీ శాసనసభాపక్షంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశంలో చంద్రబాబు నిర్ణయించినట్టు తెలింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments