Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీల ప్రాణం తీసిన అతివేగం.. విహార యాత్రలో విషాదం

అతివేగం నలుగురు టెక్కీల ప్రాణం తీసింది. అతివేగం వారిని తిరిగిరాని లోకాలకు చేర్చింది. ఫలితంగా విహార యాత్రలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... టీసీఎస్‌ కంపెనీకి చెందిన కొందరు ఇంజనీర్లు వ

Webdunia
సోమవారం, 2 జులై 2018 (13:53 IST)
అతివేగం నలుగురు టెక్కీల ప్రాణం తీసింది. అతివేగం వారిని తిరిగిరాని లోకాలకు చేర్చింది. ఫలితంగా విహార యాత్రలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... టీసీఎస్‌ కంపెనీకి చెందిన కొందరు ఇంజనీర్లు విహారయాత్ర కోసం ఆదిలాబాద్‌ జిల్లా, నేరడిగొండ మండలం, కుంటాల జలపాతాన్ని సందర్శనార్థం వచ్చారు.
 
తిరుగు ప్రయాణంలో నిర్మల్‌ జిల్లా ఎల్లపెల్లి గ్రామ సమీపంలో వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా టైరు పేలిపోవడంతో వాహనం డివైడర్‌ను ఢీకొని, పల్టీలు కొట్టి, రోడ్డుపక్కన పడింది. ఈ ప్రమాదంలో వాహనాన్ని నడుపుతున్న సాప్ట్‌వేర్‌ ఉద్యోగి దినేష్‌ (27), కుసుమ (28) అక్కడికక్కడే మృతిచెందారు. 
 
మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడడంతో వారిని హుటాహుటిన నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఏరియాస్పత్రికి తరలించి చికిత్సలు జరిపారు. తీవ్రంగా గాయపడినవారిలో యుగేంధర్‌, శ్రీవిద్య, నవీన్‌, నిఖిత ఉన్నారు. వీరికి అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం నిజామాబాద్‌కు తరలించారు. నిజామాబాద్‌లో చికిత్సపొందుతూ వీరిలో శ్రీవిద్య మృతిచెందింది. ఆ తర్వాత మరో ఇద్దరు టెక్కీలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments