జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తే.. ఎగిరి బైకుపై పడ్డాడు.. ఆపై?

హైదరాబాదులో వాహనాల రద్దీ కారణంగా రోడ్డు దాటాలంటేనే పాదచారులు హడలిపోతున్నారు. మెరుపు వేగంతో వాహనాలు దూసుకుపోవడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తరచుగా జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలతో క

Webdunia
గురువారం, 19 జులై 2018 (16:23 IST)
హైదరాబాదులో వాహనాల రద్దీ కారణంగా రోడ్డు దాటాలంటేనే పాదచారులు హడలిపోతున్నారు. మెరుపు వేగంతో వాహనాలు దూసుకుపోవడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తరచుగా జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలతో కొంత మంది ప్రాణాలు కోల్పోతే మరికొంతమంది గాయాలపాలవుతున్నారు. అయితే ట్యాంక్‌బండ్‌పై ఓ బైకిస్ట్‌ ఓ వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
 
ఈ నెల 14వ తేదీన ట్యాంక్‌బండ్ సమీపంలోని జీబ్రా క్రాసింగ్‌ దగ్గర రోడ్డు క్రాస్ చేయాలనే కంగారులో సిగ్నల్ కూడా సరిగ్గా చూసుకోకుండా.. కాస్త గ్యాప్ దొరకడంతో రోడ్డు దాటేందుకు ఓ వృద్ధుడు పరుగులు తీశాడు. బస్సును దాటి కాస్త ముందుకు రాగానే వేగంగా వచ్చిన బైక్‌ ఆ పెద్దాయనను ఢీకోవడంతో ఎగిరి బైక్‌పైనే పడ్డాడు. 
 
స్పీడ్‌గా వెళ్తున్న బైకిస్ట్‌ బండిని బ్యాలెన్స్‌ చేసే క్రమంలో దాదాపు 300 మీటర్లు వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ విజువల్స్‌ అక్కడి సీసీ కెమెరాలకు చిక్కాయి. ఈ ప్రమాదంలో వృద్ధుడైన వెంకటేశ్వరరావు స్పల్పగాయాలతో బయటపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments