Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తే.. ఎగిరి బైకుపై పడ్డాడు.. ఆపై?

హైదరాబాదులో వాహనాల రద్దీ కారణంగా రోడ్డు దాటాలంటేనే పాదచారులు హడలిపోతున్నారు. మెరుపు వేగంతో వాహనాలు దూసుకుపోవడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తరచుగా జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలతో క

Webdunia
గురువారం, 19 జులై 2018 (16:23 IST)
హైదరాబాదులో వాహనాల రద్దీ కారణంగా రోడ్డు దాటాలంటేనే పాదచారులు హడలిపోతున్నారు. మెరుపు వేగంతో వాహనాలు దూసుకుపోవడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తరచుగా జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలతో కొంత మంది ప్రాణాలు కోల్పోతే మరికొంతమంది గాయాలపాలవుతున్నారు. అయితే ట్యాంక్‌బండ్‌పై ఓ బైకిస్ట్‌ ఓ వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
 
ఈ నెల 14వ తేదీన ట్యాంక్‌బండ్ సమీపంలోని జీబ్రా క్రాసింగ్‌ దగ్గర రోడ్డు క్రాస్ చేయాలనే కంగారులో సిగ్నల్ కూడా సరిగ్గా చూసుకోకుండా.. కాస్త గ్యాప్ దొరకడంతో రోడ్డు దాటేందుకు ఓ వృద్ధుడు పరుగులు తీశాడు. బస్సును దాటి కాస్త ముందుకు రాగానే వేగంగా వచ్చిన బైక్‌ ఆ పెద్దాయనను ఢీకోవడంతో ఎగిరి బైక్‌పైనే పడ్డాడు. 
 
స్పీడ్‌గా వెళ్తున్న బైకిస్ట్‌ బండిని బ్యాలెన్స్‌ చేసే క్రమంలో దాదాపు 300 మీటర్లు వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ విజువల్స్‌ అక్కడి సీసీ కెమెరాలకు చిక్కాయి. ఈ ప్రమాదంలో వృద్ధుడైన వెంకటేశ్వరరావు స్పల్పగాయాలతో బయటపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments