Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్‌కు అన్యాయం' .. ఇందులో తానూ భాగస్వామినే : తమ్మినేని సీతారాం

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (13:10 IST)
గతంలో మహానేత, స్వర్గీయ ఎన్.టి. రామారావుకు జరిగిన అన్యాయంలో తాను కూడా భాగస్వామినేనని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం జరిగిన సభలో స్పీకర్ తమ్మినేని - విపక్ష నేత చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇదేం పార్టీ ఆఫీసు కాదని.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు స్పీకర్ తమ్మినేని స్పందిస్తూ.. ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని మండిపడ్డారు. ఈ క్రమంలో స్పీకర్‌ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.
 
ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ, వైసీపీ ఆఫీసన్న విపక్ష నేత మాటలు వెనక్కి తీసుకోవాలని కోరారు. సభపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. అసెంబ్లీ ప్రజల జాగీర్‌ మాత్రమేనని స్పీకర్‌ స్పష్టం చేశారు. గతంలో సభలో ఎన్టీఆర్‌కు అవకాశం ఇవ్వకపోవడం తప్పేనన్నారు. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినేనని.. అందుకు 15ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానని స్పీకర్‌ తమ్మినేని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments