Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్‌కు అన్యాయం' .. ఇందులో తానూ భాగస్వామినే : తమ్మినేని సీతారాం

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (13:10 IST)
గతంలో మహానేత, స్వర్గీయ ఎన్.టి. రామారావుకు జరిగిన అన్యాయంలో తాను కూడా భాగస్వామినేనని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం జరిగిన సభలో స్పీకర్ తమ్మినేని - విపక్ష నేత చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇదేం పార్టీ ఆఫీసు కాదని.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు స్పీకర్ తమ్మినేని స్పందిస్తూ.. ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని మండిపడ్డారు. ఈ క్రమంలో స్పీకర్‌ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.
 
ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ, వైసీపీ ఆఫీసన్న విపక్ష నేత మాటలు వెనక్కి తీసుకోవాలని కోరారు. సభపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. అసెంబ్లీ ప్రజల జాగీర్‌ మాత్రమేనని స్పీకర్‌ స్పష్టం చేశారు. గతంలో సభలో ఎన్టీఆర్‌కు అవకాశం ఇవ్వకపోవడం తప్పేనన్నారు. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినేనని.. అందుకు 15ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానని స్పీకర్‌ తమ్మినేని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments