Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్‌కు అన్యాయం' .. ఇందులో తానూ భాగస్వామినే : తమ్మినేని సీతారాం

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (13:10 IST)
గతంలో మహానేత, స్వర్గీయ ఎన్.టి. రామారావుకు జరిగిన అన్యాయంలో తాను కూడా భాగస్వామినేనని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం జరిగిన సభలో స్పీకర్ తమ్మినేని - విపక్ష నేత చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇదేం పార్టీ ఆఫీసు కాదని.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు స్పీకర్ తమ్మినేని స్పందిస్తూ.. ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని మండిపడ్డారు. ఈ క్రమంలో స్పీకర్‌ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.
 
ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ, వైసీపీ ఆఫీసన్న విపక్ష నేత మాటలు వెనక్కి తీసుకోవాలని కోరారు. సభపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. అసెంబ్లీ ప్రజల జాగీర్‌ మాత్రమేనని స్పీకర్‌ స్పష్టం చేశారు. గతంలో సభలో ఎన్టీఆర్‌కు అవకాశం ఇవ్వకపోవడం తప్పేనన్నారు. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినేనని.. అందుకు 15ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానని స్పీకర్‌ తమ్మినేని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments