Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్‌తో కలిసి ఇంటికెళ్లిన విద్యార్థిని.. మార్గమధ్యంలో గ్యాంగ్ రేప్...

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (09:51 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఓ స్నేహితుడితో కలిసి ఇంటికెళుతున్న ఓ విద్యార్థినిపై ఆరుగురు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు తక్షణం స్పందించి నిందితులను అరెస్టు చేసి వారిపై గూండా చట్టం ప్రయోగించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోయంబత్తూరు జిల్లా సీరనాయగన్‌పాళయానికి చెందిన ఓ విద్యార్థిని ప్లస్ట వన్ చదువుతోంది. ఆమె ఈ నెల 26వ తేదీన స్నేహితుడితో కలసి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఆరుగురుతో దుండగులు స్నేహితుడిపై దాడిచేసి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ దుండగుల నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితురాలు జరిగిన ఘటనను కుటుంబ సభ్యులదృష్టికి తీసుకెళ్ళి, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. తక్షణం రంగంలోకిదిగి అదే ప్రాంతానికి చెందిన మణికంఠన్‌ (27), కార్తీ (26), రాహుల్‌ (21), ప్రకాష్‌ (22), కార్తీకేయన్‌ (28), నారాయణమూర్తి (32)లను పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు. న్యాయస్థానంలో హాజరుపరచి జైలుకు తరలించారు. 
 
ఆ తర్వాత మణికంఠన్‌, కార్తీ, రాహుల్‌పై గూండా చట్టం ప్రయోగించాలంటూ మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కోవై నగర కమిషనర్‌ సుమిత్రాచరణ్‌ను కోరారు. ఈ కేసును విచారించిన కమిషనర్... నిందితులు ముగ్గురిపై గూండా చట్టం ప్రయోగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. గూండా చట్టం కింద అరె్‌స్టచేసిన ముగ్గురిని పోలీసులు కోవై కేంద్ర కారాగారానికి తరలించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం