Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ సన్యాసం తీసుకుంటావా? ఎర్రబెల్లిని టార్గెట్ చేసిన తలసాని

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (14:25 IST)
టీ టీడీపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన నేతలు, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మొన్నటికి మొన్న టీ టీడీపీ కార్యకర్తలు చావు డప్పు మోగించిన సంగతి తెలిసిందే.

దీనిపై తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ధీటుగా స్పందించారు. టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావును టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
సనత్ నగర్‌కు జరిగే ఉప ఎన్నికల్లో తాను ఓటమిపాలైతే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని తలసాని ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఓడితే, రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అంటూ ఆయన ఎర్రబెల్లికి సవాల్ విసిరారు. నోటి మాటతో కాకుండా పెద్ద మనుషుల సమక్షంలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుందాం రమ్మంటూ తలసాని ఛాలెంజ్ చేశారు. మరి దీనికి ఎర్రబెల్లి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments