Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్ కార్డులు ఇవ్వాలి : పరిపూర్ణానంద స్వామి

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (10:32 IST)
దేశంలోని పౌరులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆధార్ కార్డులపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం హిందువులు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆయన సూచించారు. అదేసమయంలో దేశంలో హిందూ పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకుని రావాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఈ వ్యాఖ్యలను జగిత్యాలలో చెబుతున్నానని అంటే జగమంతా చెప్పినట్టేనని తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో సోమవారం జరిగిన వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో హిందూ పరిరక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హిందువులుగా జీవించేవారికి, హిందువులు కాకపోయినప్పటికీ హిందువులను, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికి మాత్రమే ఆధార్ కార్డులను ఇవ్వాలని కోరారు. 
 
జగిత్యాలలో చెబితే జగమంతా చెప్పినట్టేనని అందుకనే ఇక్కడే చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఈ అంశం దేశ వ్యాప్తంగా కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క దానికి ఆధారమైన ఆధార్ కార్డులను ఎవరికిపడితే వారికి ఇవ్వరాదని ఆయన కేంద్రాన్ని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments