Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా చీఫ్ జగన్ బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీంలో కీలక పరిణామం!!

ఠాగూర్
మంగళవారం, 12 నవంబరు 2024 (12:47 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పిటిషన్‌పై విచారణను డిసెంబరు 2వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆ రోజున ఈ కేసును లిస్ట్ చేయాలంటూ రిజిస్ట్రీని అదేశించింది. 
 
జగన్‌ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ధర్మాసనం ముందు విచారణకు రాగా వాటిని మరో బెంచ్‌కు మార్చింది. 
 
జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్‌ నుంచి మార్చాలని తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గతంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెల్సిందే. దీనిపై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్లపై విచారణ బెంచ్‌ను మార్చింది. సీజేఐ ధర్మాసనంలో జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ సభ్యుడిగా ఉన్నారు. 
 
విచారణ ప్రారంభం కాగానే.. ఈ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి అని జగన్‌ తరపు న్యాయవాది రంజిత్‌ కుమార్‌ తెలిపారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో కౌంటర్‌ దాఖలు చేసేందుకు తమకు కూడా కొంత సమయం కావాలని సీబీఐ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు.
 
ఈ క్రమంలో జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ 'నాట్‌ బిఫోర్‌ మీ' అనడంతో రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను మరో ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు. జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు డిసెంబరు 2వ తేదీన విచారణకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

తర్వాతి కథనం
Show comments